ఈ బ్లాగ్ లో పురాతన, మరుగున పడిన, రహస్యమయమైన ఆలయాలు వాటి వెనకున్న పురాణ, ఆధ్యాత్మిక, చారిత్రక, పర్యాటక ప్రాధాన్యత తెలుసుకోవచ్చు.
29, జూన్ 2024, శనివారం
26, జూన్ 2024, బుధవారం
21, జూన్ 2024, శుక్రవారం
15, జూన్ 2024, శనివారం
కేదార్ నాథ్ ఆలయానికి ఎందుకంత ప్రాధాన్యత!? హిమాలయాల్లో శివయ్య లీల
కేదార్ నాథ్
ఎటువంటి
టెక్నాలజీ, పరిజ్ఞానం లాంటివి
అందుబాటులో లేని ఆ కాలంలోనే ఎంతో
అద్భుతంగా దేవాలయాలను నిర్మించారు మన పూర్వీకులు. ఇప్పుడు ఉన్నట్టు జేసీబీలు కానీ
భారీ వాహనాలు అంటూ ఏవీ లేని కాలంలో కూడా
ఎన్నో వేల టన్నుల బరువున్న బండ రాళ్ళను
సైతం ఒక చోటికి చేర్చి దేవాలయాలను నిర్మించిన
ఆ టెక్నాలజీ మన భారతీయుల సొంతం. అలాంటి అద్భుత ఆలయం హిమాలయాల్లో నెలకొన్న
కేదార్ నాథ్ ఆలయం.
ఆరునెలలు
మాత్రమె ఇక్కడ పూజలు జరుగుతాయి. మిగిలిన ఆరునెలలు మూసి ఉంటుంది. ఆరు నెలలు
మూసేసినా కూడా మళ్ళీ తెరిచినపుడు ఆలయం పరిశుభ్రంగా ఉంటుంది. ఆలయంలో దీపం
వెలుగుతూనే ఉంటుంది. కేదార్నాథ్ ఆలయాన్ని
బూడిద రంగులో ఉన్న అతిపెద్ద రాళ్లతో నిర్మించారు. ఆ రోజుల్లో ఇంత భారీ
ఎత్తున్న ఉన్న రాళ్లతో ఎలా
నిర్మించారన్నది ఇప్పటికీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీనికి సంబంధించి
శాస్త్రవేత్తలు ఎన్ని పరిశోధనలు చేసిన లాభం లేకపోయింది.
ఈ
ఆలయానికి సంబంధించి పూర్తి చరిత్ర కింద వీడియోలో చూడండి
నమ్మడం కష్టమే!కాని నమ్మక తప్పదు! 2013 వరదల్లో కేదార్ నాథ్ గుడిని రక్షించినదిదే!
భీమ్ శిల - కేదార్ నాథ్ వరదలు
2013 లో ప్రకృతి
ప్రకోపానికి ఉత్తరాఖండ్ వరదల్లో
మునిగిపోయింది. ఎంతో జననష్టం, ఆస్తి నష్టం జరిగింది కానీ కేదార్నాథ్ ఆలయానికి మాత్రం ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఆ సమయంలో
అక్కడ భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఇక ఈ వరదల్లో వేలాది ఇళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి…
ధ్వంసమయ్యాయి, వేలాది మంది మరణించారు. పెద్ద పెద్ద కట్టడాలు
కూడా పేకమేడల్లా కుప్పకూలిపోయాయి… అలాంటి సమయంలో కేదార్నాథ్ ఆలయంలో వందల మంది భక్తులు
చిక్కుకుపోయారు…
అలాంటి సమయంలో ఇంకా భయపెట్టడానికి అన్నట్టుగా ఎంతో ఎత్తు మీద నుంచి ఒక పెద్ద ఏకరాతి శిల కొట్టుకుంటూ, దొర్లుకుంటూ వచ్చింది. అంత భారీ శిల గనక ఆలయాన్ని ఢీకొంటే మాత్రం అంతా ఇక ఐపోయినట్టే అనుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. ఐతే ఆ రాయి అలా దొర్లుకుంటూ వచ్చి గుడికి కొంచెం వెనకగా పడి ఇక అక్కడితో ఆగిపోయింది. ఆ భారీ శిల ఈ వరద ప్రవాహాన్ని రెండు పాయలుగా చీల్చేసరికి వరద గుడికి రెండు వైపులా నుంచి శరవేగంగా వెళ్ళిపోయింది. దాంతో ఆలయానికి ఎం కాలేదు. భక్తులు కూడా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. గుడి సేఫ్ గా ఉంది.
ఆ రాయే భీమశిల. ఇప్పటికి కూడా భక్తుల చేత
పూజలందుకుంటోంది. భీమశిల గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే కింద వీడియో చూడండి.`
సరస్వతీ నది నిజంగా ఉండేదా? లేక అన్నీ పుక్కిటి పురాణాలా?
సరస్వతీ నది నిజంగా ఉందా? ఎప్పుడో ఉండేది తరువాత అంతర్హితమయిపోయింది అని చెబుతారు. సరస్వతీ నది అసలు ఉండేదా? లేక అన్నీ పుక్కిటి పురా...

-
కేదార్ నాథ్ ఎటువంటి టెక్నాలజీ , పరిజ్ఞానం లాంటివి అందుబాటులో లేని ఆ కాలంలోనే ఎంతో అద్భుతంగా దేవాలయాలను నిర్మించారు మన పూర్...
-
భీమ్ శిల - కేదార్ నాథ్ వరదలు 2013 లో ప్రకృతి ప్రకోపానికి ఉత్తరాఖండ్ వరదల్లో మునిగిపోయింది. ఎంతో జననష్టం , ఆస్తి నష్టం జరి...