15, జూన్ 2024, శనివారం

కేదార్ నాథ్ ఆలయానికి ఎందుకంత ప్రాధాన్యత!? హిమాలయాల్లో శివయ్య లీల

 

కేదార్ నాథ్



          ఎటువంటి టెక్నాలజీ, పరిజ్ఞానం లాంటివి  అందుబాటులో లేని ఆ  కాలంలోనే ఎంతో అద్భుతంగా దేవాలయాలను నిర్మించారు మన పూర్వీకులు. ఇప్పుడు ఉన్నట్టు జేసీబీలు కానీ భారీ వాహనాలు అంటూ ఏవీ  లేని కాలంలో కూడా ఎన్నో  వేల టన్నుల బరువున్న బండ రాళ్ళను సైతం ఒక చోటికి చేర్చి దేవాలయాలను నిర్మించిన  ఆ టెక్నాలజీ మన భారతీయుల సొంతం. అలాంటి అద్భుత ఆలయం హిమాలయాల్లో నెలకొన్న కేదార్ నాథ్ ఆలయం.



ఆరునెలలు మాత్రమె ఇక్కడ పూజలు జరుగుతాయి. మిగిలిన ఆరునెలలు మూసి ఉంటుంది. ఆరు నెలలు మూసేసినా కూడా మళ్ళీ తెరిచినపుడు ఆలయం పరిశుభ్రంగా ఉంటుంది. ఆలయంలో దీపం వెలుగుతూనే ఉంటుంది. కేదార్‌నాథ్ ఆలయాన్ని  బూడిద రంగులో ఉన్న అతిపెద్ద రాళ్లతో నిర్మించారు. ఆ రోజుల్లో ఇంత భారీ ఎత్తున్న ఉన్న  రాళ్లతో ఎలా నిర్మించారన్నది ఇప్పటికీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీనికి సంబంధించి శాస్త్రవేత్తలు ఎన్ని పరిశోధనలు చేసిన లాభం లేకపోయింది.

ఈ ఆలయానికి సంబంధించి పూర్తి చరిత్ర కింద వీడియోలో చూడండి 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి