ఈ ఆలయం గురించి వింటే
దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే !!!
భారతదేశంలో ఎన్నో హిందూ పుణ్యక్షేత్రాల్లో సైన్స్కు అందని అద్భుతాలు
ఎన్నో ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు 50 కి.మీ
దూరంలో బెహతా గ్రామంలో ఉన్న జగన్నాథ్ ఆలయం ఒకటి. ఈ ఆలయంలో జరిగే అద్భుతం గురించి
వింటే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఈ ఆలయం వర్షాకాలాన్ని ముందుగానే
అంచనా వేసి చెబుతుందట. రుతుపవనాలు ఎప్పుడు వస్తాయి? ఏడాదిలో
ఎంత వర్షం కురుస్తుంది? తక్కువా.. ఎక్కువా.. ఇవన్నీ
చెప్తుందట. అందుకే ఈ జగన్నాథుని ఆలయాన్ని మాన్సూన్ టెంపుల్ అని పిలుస్తారట.
రుతుపవనాల రాకకు కొన్ని రోజుల ముందు.. ఆలయ గర్భగుడి పైకప్పు నుంచి
నీటి చుక్కలు పాడడం మొదలుతుంది. ఈ నీటిచుక్కల సైజును బట్టి ఆ ఏడాది ఎక్కువ వర్షాలు
పడతాయా? తక్కువ పడతాయా? అనేది అంచనా వేస్తారట. జూన్ నెల
ఫస్ట్ హాఫ్లో ఆలయ గర్భగుడి నుంచి చుక్కలు పడటం ప్రారంభమవుతుందట. ఈ ఆలయంలో
జగన్నాథుని 15 అడుగులు నల్లరాతి విగ్రహంతో పాటు ఆయన సోదరుడు
బలరాముడు, సోదరి సుభద్ర విగ్రహాలున్నాయి.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి