ఈ బ్లాగ్ లో పురాతన, మరుగున పడిన, రహస్యమయమైన ఆలయాలు వాటి వెనకున్న పురాణ, ఆధ్యాత్మిక, చారిత్రక, పర్యాటక ప్రాధాన్యత తెలుసుకోవచ్చు.
29, సెప్టెంబర్ 2025, సోమవారం
26, సెప్టెంబర్ 2025, శుక్రవారం
4, ఏప్రిల్ 2025, శుక్రవారం
సరస్వతీ నది నిజంగా ఉండేదా? లేక అన్నీ పుక్కిటి పురాణాలా?
సరస్వతీ నది నిజంగా ఉందా? ఎప్పుడో ఉండేది తరువాత అంతర్హితమయిపోయింది అని చెబుతారు. సరస్వతీ నది అసలు ఉండేదా? లేక అన్నీ పుక్కిటి పురాణాల అన్న సందేహం కూడా మనకు వస్తుంది. కానీ ఆ నది ఉండేది అనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. ఎప్పుడో వేల క్రితమే అంటే కలియుగం ఆరంభం కాకముందే ద్వాపర యుగంలో అంటే మహాభారత కాలం నాటికే సరస్వతి నది అంతర్హితమవ్వడం మొదలైంది అని చెప్తున్నాయి కొన్ని కథనాలు. ఇది ఇది వేదకాలంనాటి నది. సప్తనదులు అని చెప్పే ఏడు పుణ్య నదులలో అన్నిటికంటే ఉత్తమమైనదిగా ఋగ్వేదంలో వర్ణించారు. నదులకు తల్లిగా, దేవతగా, ఉత్తమ నదిగా వర్ణించింది సరస్వతి నదిని ఋగ్వేదం. సరస్వతి నదిని ‘సింధుమాత’ అని పిలుస్తారు. అంటే నదులకు తల్లి అని అర్థం. ఇది కనపడకుండా ప్రవహిస్తుంది కాబట్టే దీనిని అంతర్వాహిని అని పిలుస్తారు.
సరస్వతి దేవే నది రూపంలో ప్రవహించిందని, నదీ దేవత అని
వేదాలలోను, పురాణాలలోనూ కూడా సరస్వతీ నది వర్ణన కనబడుతుంది. కురుక్షేత్రంలో అఘావతి
పేరుతో ప్రవహించే సరస్వతి నదిలో ఏడు నదులు సంగమించేవని చెపుతారు.
3, ఏప్రిల్ 2025, గురువారం
సరస్వతీ నది ప్రత్యక్షంగా కనబడే మానా గ్రామం, India's first village Mana near Badrinath Uttarakhand
మానా,
సరస్వతీ నది పుష్కరాలు జరిగే ప్రదేశం,
పాండవులు స్వర్గారోహణ చేసిన ప్రదేశం,
మహాభారత గ్రంధం
పుట్టిన ప్రదేశం,అది సరస్వతీ నది పుష్కరాలు జరిగే ప్రధాన స్థలం.
ఇండో... టిబెటన్ సరిహద్దుల్లో ఉన్న ఈ గ్రామం ఈ రెండు దేశాలకు ఒకప్పుడు ప్రధాన
వాణిజ్య మార్గం.
మహాభారత గ్రంధం పుట్టిన ప్రదేశం. అంతర్వాహినిగా ప్రవహించడమే తప్ప ఎక్కడా మానవ మాత్రులకు కనబడని సరస్వతి నది ప్రవాహం ప్రత్యక్షంగా చూడా లంటే అక్కడకు వెళ్ళాల్సిందే. మీకు పాండవులు స్వర్గారోహణ చేసిన ప్రాంతం చూడాలని ఉందా.. పాండవులు స్వర్గానికి వెళ్ళడానికి భీముడు కట్టిన వంతెన... భీమ పూల్ చూడాలనుకుంటున్నారా ... వ్యాసుడు ఆశువుగా చెప్తూ ఉంటె వినాయకుడు చకచకా మహాభారతం రాసిన చోటు చూస్తే ఎలా ఉంటుంది? ఆ చూడాలనుకున్నా చూడగలమా... అది సాధ్యపడే విషయం కాదు అనుకుంటున్నారా... ఖచ్చితంగా సాధ్యపడుతుంది. దేవభూమిగా పేరు పొందిన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మానా గ్రామం వెళితే ఇవన్నీ చూడవచ్చు. రెండేళ్ళ క్రితం వరకు భారతదేశపు చివరి గ్రామం గా చెప్పబడిన మానా గ్రామం ఇప్పుడు భారత దేశపు మొదటి గ్రామంగా పిలుస్తున్నారు... ఈ మార్పు ఎందుకు జరిగింది... బిజినెస్ ప్రమోషన్ లో ఈ మానా గ్రామ ప్రజలు అందే వేసిన చెయ్య అని చెప్పుకోవాలి... అదెలా... ఈ విశేషాలన్నీ ఈ క్రింది వీడియో క్లిక్ చేసి చూడండి
...
వందల ఆలయాలు నిర్మించిన అహిల్యాబాయి హోల్కర్,great story of rani Ahilyabai Holkar,
అహిల్యాబాయి
హోల్కర్... ఏ ఆలయ చరిత్ర చూసినా తప్పక వినబడే పేరు. కాశీ, ద్వారక, మథుర, ఉజ్జయిని,
రామేశ్వరం, అయోధ్య, హరిద్వార్,
జ్యోతిర్లింగాలు ఇలా అనేక పుణ్యక్షేత్రాల స్థల పురాణాల్లో ఆమె పేరు
తప్పనిసరిగా వినబడుతుంది. భారతదేశమంతటా... ఆసేతు హిమాచలం వరకు మహమ్మదీయుల దాడులలో
శిథిలమైన అనేక వందల ఆలయాలను పునర్నిర్మించి, పూర్వ వైభవాన్ని తీసుకువచ్చిన పుణ్య
చరితురాలు. ఆలయాలను, నదీ తీరాలలో స్నాన ఘట్టాలను, ధర్మశాలలను నిర్మింపచేసి యాత్రికులకు యాత్రామార్గాలను సుగమం చేసిన
పుణ్యాత్మురాలు.
భారతదేశం అంతటా
ముఖ్యంగా దేశం ధార్మికంగా అల్లకల్లోలంగా, హిందూ ధర్మం,
సంస్కృతికి విఘాతం ఏర్పడినపుడు, మన సంస్కృతికి, ధర్మానికి పట్టుకొమ్మలయిన దేవాలయాలను పునరుద్ధరించారు.
ఒక సామాన్య
కుటుంబం నుంచి వచ్చి, పరిపాలనాదక్షకురాలిగా, సామ్రాజ్య నిర్మాతగా, ముఖ్యంగా ఆలయాల నిర్మాతగా, పరమభక్తురాలిగా స్త్రీ
శక్తిని దేశ నలుమూలలా చాటిన మహానుభావురాలు ఆమె. నారీశక్తికి నిలువెత్తు నిదర్శనం... ఆమే రాణీ అహల్యాబాయి హోల్కర్. అహల్యాబాయి హోల్కర్
గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం...
2, ఏప్రిల్ 2025, బుధవారం
సరస్వతీ నది ఎలా ఆవిర్భవించింది?
సరస్వతీనది
ఆవిర్భావం ఎలా జరిగింది అన్న పురాణ కథనం విషయానికి వస్తే, దేవీ భాగవతంలో ఒక కథనం ప్రకారం ఆ పరాశక్తి,
సృష్టికి ముందే ఐదు రూపాయలు ధరించిందట. అవి దుర్గా, రాధ, లక్ష్మి, సరస్వతి,
సావిత్రి. వారిలో జ్ఞానప్రదాయినిగా సరస్వతిదేవి భాసిల్లింది. ఈ తల్లిని మొట్టమొదట
శ్రీకృష్ణుడు మాఘ పంచమినాడు పూజించాడని, అప్పటి నుంచే
మాఘపంచమి నాడు అమ్మను ఆరాధించడం ప్రారంభించినట్లు చెప్తారు.
మరో పురాణ కథనం ప్రకారం బ్రహ్మదేవుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు
అతడి నోటి నుండి ఒక అందమైన కన్య వెలికి వచ్చిందట. ఆ కన్యకు వాక్ అని పేరు పెట్టిన
బ్రహ్మదేవుడు సకల జనులకు వాక్ శుద్ధి ప్రసాదించే దేవతగా పండితుల నాలుకల మీద,
భూమిమీద నది రూపంలో రెండవ విధంగా,
ఇక మూడో విధంగా తనలోనే ఉండమని ఆమెను ఆశీర్వదించాడట. అలా సరస్వతి మాత భూమి మీద నది
రూపంలో ప్రవహించింది అని చెప్తారు.
ఇక పురాణ కథనాల్లో
సరస్వతీనదికి సంబంధించి, వివిధ కథనాలు మనకు కనబడతాయి. ఋగ్వేదంలో సరస్వతిగా
వర్ణించబడిన ఈ నది ఒకప్పుడు విశ్వామిత్ర మహర్షి శాప ఫలితంగా భూతప్రేతాలకు ఆలవాలంగా
మారిందట. వశిష్ట మహర్షిని బద్ధ శత్రువుగా భావించే విశ్వామిత్రుడు, వశిష్టుని
ఎలాగైనా పరాభవించాలన్న సంకల్పంతో సరస్వతీ నది తీరంలో సరస్వతి మాతను లింగాకారంలో
ప్రతిష్టించి ఆరాధించాడట. అతని భక్తికి మెచ్చిన సరస్వతీ మాత ప్రత్యక్షమై ఏం వరం
కావాలో కోరుకోమంది. తనకేమీ అక్కరలేదని, నదికి ఆవలి ఒడ్డున ఉన్న వశిష్టుని నదీ
జలాల్లో ముంచి తీసుకురమ్మని కోరాడు విశ్వామిత్రుడు. అయితే ఈ కోరిక చాలా అన్యాయము. పైగా సాత్వికుడు
తన భక్తుడు అయినటువంటి ఆ వశిష్ఠుడిని అలా చేయడానికి నిరాకరించింది సరస్వతీమాత.
దాంతో క్రోధానికి లోనయిన విశ్వామిత్రుడు, ఆ
నది భూతప్రాతాలకు పిశాచాలకు ఆలవాలంగా మారుతుందని శపించాడు. నది యొక్క దుర్దశను
చూసిన ఋషులు తమ యొక్క తపశక్తినంతా ధారపోసి సరస్వతీ నదిని సంరక్షించి
పూర్వవైభవాన్ని తెచ్చినట్టుగా ఓ కథనం.
ఈ సరస్వతి నది పశ్చిమ తీరాన ఉన్న బదరికా వనలోనే వ్యాసుడు భాగవత
కావ్యాన్ని వ్రాశాడు అని కూడా చెబుతారు. ఇది ప్రస్తుతం బద్రీనాథ్ సమీపంలో ఉన్న మాన
గ్రామానికి కొద్ది దూరంలో మనం చూడొచ్చు. ఇక బలరాముడు ద్వారకనుండి మధురకు
వెళ్ళినప్పుడు సరస్వతి యమునల మార్గంలోనే పయనించాడట. ఇలా ఎన్నో సందర్భాలలో సరస్వతీ
నది ప్రస్తావన మనకు కనబడుతుంది. సరస్వతి నది ఈ భూమ్మీద ఏడు పేర్లతో ఉద్భవించినట్టు
పురాణాలు చెబుతున్నాయి. అవి సుప్రభ, కాంచనాక్షి, విశాల, మనోరమ, సరస్వతి, ఒషువతి, సురేణువు,
విమలోదక.
ఒకసారి పుష్కర తీరంలో
బ్రహ్మదేవుడు యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞ ప్రభావంతో ఏ పదార్థాలను తలుచుకుంటే అవన్నీ
ప్రత్యక్షమయ్యాయట. దాంతో యజ్ఞం సుసంపన్నమైనట్టుగా భావించారందరూ. కానీ అక్కడ పరమ
పవిత్రమైన సరస్వతి నది జలాలు లేవు కాబట్టి యాగం పరిపూర్ణం కానట్టే అన్నారు
మునులు. అప్పుడు బ్రహ్మ కోరిక మేరకు అక్కడ ఆవిర్భవించిన సరస్వతి నది సుప్రభగా
పిలవబడింది. ఇక సరస్వతి నది మిగిలిన నామములు విషయానికొస్తే, నైమిశారణ్యంలో
సత్రయాగం చేస్తున్న మునుల కోరికపై కాంచనాక్షి గాను, గయలో గయ మహారాజు చేసిన యజ్ఞంలో
అతడి ఆహ్వానం మీద విశాల అన్న పేరుతోనూ, కోసల ప్రాంతంలో ఉద్దాలకుడు చేసిన యజ్ఞంలో
మనోరమగాను, కురుక్షేత్రంలో కురురాజు చేసిన యాగంలో సురేణువు గాను, హరిద్వార్ లో
దక్షుడు చేసిన యజ్ఞంలో సరస్వతి గాను, వశిష్టుని ఆహ్వానం మేరకు కురుక్షేత్రంలో ఓషువతి
అన్న పేరుతోను, హిమవత్ పర్వతం మీద బ్రహ్మ చేసిన యజ్ఞంలో విమలోదక అని ఈ సప్త
నామాలతో ఆవిర్భవించింది సరస్వతి నది. మరికొద్ది రోజుల్లో సరస్వతీ నది పుష్కరాలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా పూర్తి వివరాలు క్రింద వీడియోలో చూడండి...
సరస్వతీ నది పుష్కరాలు, తేదీలు, ఎక్కడ జరుగుతాయి? సరస్వతీనది నిజంగా ఉందా?
అసలు పుష్కరాలంటే ఏంటి? ఏ ఏ నదులకు జరుగుతాయి? 12 సంవత్సరాలకు ఒకసారే ఎందుకు జరుగుతాయి? ప్రత్యేకంగా కొన్ని నదులకు మాత్రమె ఎందుకు జరుగుతాయి? పుష్కరాల విశిష్టత ఏంటి? పుష్కరాల సమయంలో పాటించాల్సిన విధులు ఏంటి?
-
సరస్వతీ నది నిజంగా ఉందా? ఎప్పుడో ఉండేది తరువాత అంతర్హితమయిపోయింది అని చెబుతారు. సరస్వతీ నది అసలు ఉండేదా? లేక అన్నీ పుక్కిటి పురా...
-
మానా , సరస్వతీ నది పుష్కరాలు జరిగే ప్రదేశం , పాండవులు స్వర్గారోహణ చేసిన ప్రదేశం , మహాభారత గ్రంధం పుట్టిన ప్రదేశం , అది సరస్వతీ నద...