17, ఆగస్టు 2024, శనివారం

తిరుమలలో ఈరోజు(ఆగస్ట్16) భక్తుల ర వివరాలు

 


నమస్కారం అండి. ఈ రోజు పోస్ట్ లో కలియుగ వైకుంఠమ్ తిరుమల శ్రీవారి ఆలయంలో రద్దీ, దర్శన వివరాలు, మరికొన్ని విశేషాల గురించి తెలియచేస్తాను, ముందుగా శ్రీవారి ఆలయంలో దర్శన వివరాలు... 

నిన్న శుక్రవారం 62,625 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.  34,462 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. 3.63 కోట్ల హుండీ కానుకలు వచ్చాయి. భక్తుల రద్దీ చూస్తే విపరీతంగా పెరిగింది. మొత్తం కంపార్ట్మెంట్స అన్నీ నిండిపోయి. శిలాతోరణం వరకు క్యూ లైన్ ఉంది. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శనానికి 18 నుంచి 24 గంటలు పడుతోంది.

    ఇక తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం శాస్త్రోక్తంగా ప‌విత్ర సమర్పణ జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో
శ్రీ జె.శ్యామలరావు దంపతులు పాల్గొన్నారు.






    ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ తరువాత సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం వేద ఘోష, మంగళవాయిద్యాల నడుమ శ్రీవారి మూలవర్లకు, ఉత్సవ మూర్తులకు, జ‌య‌విజ‌యుల‌కు, గ‌రుడాళ్వారుకు, వ‌ర‌ద‌రాజ‌స్వామివారికి, వ‌కుళమాత అమ్మ‌వారికి, ఆనంద నిల‌యం, యాగ‌శాల, విష్వ‌క్సేనులవారికి, యోగ‌న‌ర‌సింహ‌స్వామి వారికి, భాష్య‌కార్ల‌కు, పోటు తాయారుకు, ధ్వజస్తంభం, బ‌లిపీఠం, శ్రీభూవరాహస్వామివారికి, శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి పవిత్రమాలలు సమర్పించారు.

    అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. రాత్రి 8 నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ కారణంగా శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.

    ఇక తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శుక్రవారం అమ్మవారు స్వర్ణరథంపై ఆశీనులై భక్తులను కటాక్షించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి ప్రపత్తులతో నాలుగుమాడ వీధుల్లో రథాన్ని లాగారు. కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.





    స్వర్ణరథోత్స‌వంలో ఈవో శ్రీ జె. శ్యామల రావు దంపతులు, ఎస్ ఇ శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఆల‌య అర్చకులు శ్రీ బాబుస్వామి, సూప‌రింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, విశేష‌సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

 

 

    మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయానికి కొప్పెర వారి పల్లికి చెందిన శ్రీ కామినేని శ్రీనివాసులు, కుటుంబ సభ్యులు కుప్పెర హుండీని బహుకరించారు.




    శ్రీవారి ఆలయం ముందు టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరికి దాత కొప్పెర హుండీని అందించారు.

    ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇవి ప్రస్తుతానికి తిరుమల శ్రీవారి ఆలయంలో కొన్ని విశేషాలు. మరికొన్ని విశేషాలతో రేపటి పోస్ట్లో కలుసుకుందాం. నమస్తే

 

 

తిరుమలలో (ఆగస్ట్16) ఈరోజు భక్తుల రద్దీ,ఉత్సవాలు/tirumala latest news upd...

19, జులై 2024, శుక్రవారం

సింహగిరి ప్రదక్షిణకు సర్వం సిద్దం/మార్గదర్శకాలివే /vizag simhachalam giri pradakshina

 

భూప్రదక్షిణ తో సమానమైన ఫలితాన్నిచ్చే సింహాచలం గిరిప్రదక్షిణకు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో గిరిప్రదక్షిణ సంబరం ప్రారంభమవబోతోంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు, పర్యవేక్షణ పూర్తయిందని దీనికి సంబంధించిన వివరాలను కూడా ప్రకటించారు అధికారులు.

గిరిప్రదక్షిణను పురస్కరించుకొని 20,21 తేదీల్లో రెండురోజులు ఆర్జిత సేవలు రద్దు చేసినట్టు ఆలయ అధికారులు ప్రకటించారు. ఈ నెల  20,21 తేదీలు రెండు రోజుల్లోను సింహాచలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సుప్రభాతసేవ, ఆరాధన, నిత్యకళ్యాణం అష్టోత్తరం, సహస్రనామార్చన వంటి ఆర్జితసేవాలను రద్దు చేసినట్టు ఆలయ అధికారులు ప్రకటించారు. గిరిప్రదక్షిణ కారనంగాం భక్తులు లక్షల సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉంది  కాబట్టి ఈ రెండు రోజులు నీలాద్రి ద్వారం నుంచి మాత్రమె దర్శనాలకు అనుమతి ఇస్తున్నట్టు ఆలయ అధికారులు ప్రకటించారు.

అలాగే ఈ రెండు రోజుల్లోనూ అడవివరం, సింహాచలం ప్రాంతాలలోని మద్యం షాపులు మూసివాయాలని ఆ ప్రదేశాలలోని షాపులకు నోటీసులు కూడా జారీచేసారు. అలాగే giri ప్రదక్షిణలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు కూడా తీసుకుంటున్నట్టు అధికారులు ప్రకటించారు.

32 కిలోమీటర్ల మేర జరిగే ఈ ప్రదక్షిణలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసామని ప్రకటించారు. ఎక్కడికక్కడ వైద్య,కనీస అవసరాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గిరిప్రదక్షిణ మార్గంలో 11 మెడికల్ క్యాంపులు, 290 తాత్కాలిక, 169 శాశ్వత మరుగుదొడ్లు, వంద సిసి కెమెరాలు అమర్చారు. ప్రధాన కూడళ్ళలో అంబులెన్స్ లను సిద్ధ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సమాచారం తెలిపేలా అనౌన్స్మెంట్ సిస్టం కూడా అందుబాటులో ఉంచారు.

ఇప్పటికే సింహాచలం గిరిప్రదక్షిణ రూట్ మేప్ కూడా ప్రకటించింది. సింహాచలం తొలి పావంచా వద్ద మొదలుపెట్టి అడవివరం, ధారపాలెం, ఆరిలోవ, హనుమంతువాక, పోలీస్ క్వార్టర్స్, కైలాసగిరి టోల్ గెట్, అప్పుఘర్ జంక్షన్, mvp డబుల్ రోడ్, వెంకోజీపాలెం, hb కాలనీ కైలాసపురం, మాదవదార, మురలీనగర్, బుచ్చిరాజుపాలెం, లక్ష్మీనగర్, ఇందిరా nagar, ప్రహ్లాదాపురం, గోశాల జంక్షన్, నుంచి తోలిపావంచాకు చేరుకొని అక్కడినుంచి సింహాచలం మెట్ల మార్గం నుంచి ఆలయానికి చేరుకుంటారు.

సింహాచలం గిరిపదక్షిణ సందర్భంగా విశాఖ నగర పోలీస్ కమేశానర్ డా.శంఖబ్రత బాగ్చి.

ఆదేశాలతో రవాణాశాఖ  ట్రాఫిక్ ఆంక్షలు కూడా జారీ చేసింది. అనకాపల్లి నుంచి శ్రీకాకుళం, విజయనగరం వైపు వెళ్ళే వాహ్నదరులను విశాఖపట్నం సిటీ గుండా వెళ్ళడానికి అనుమతించరని తెలిపారు. విశాఖపట్నం సిటి నుంచి కాకుండా లంకెలపాలెం, సబ్బవరం,పెందుర్తి, ఆనందపురం ద్వారా వెళ్లాలని సూచించారు.

ఇక గిరిప్రదక్షినకు వచ్చేవారి వాహనాల పార్కింగ్ విషయంలో కూడా మార్గదర్శకాలు జారీ చేసారు. నడిచి వెళ్ళే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేసారు. విజయనగరం మార్గంల్ వచ్చి భక్తులు అడవివరం వద్దా, హనుమంతవాకవైపు నుంచి వచ్చేవారు సెంట్రల్ జైలు వద్ద రూరల్ ప్రాంతాల నుచ్న్హి వచ్చేవారు సింహపురి కాలనీలోను తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవలసిందిగా సూచించారు.

సింహాచలం గిరిప్రదక్షిణకు సర్వం సిద్దం/మార్గదర్శకాలివే/about simhachalm g...

4, జులై 2024, గురువారం

వినాయకుడికి గరిక పూజ చాలా ఇష్టమని చెప్తారు. ఎందుకో తెలుసా...???

 వినాయకుడికి గరిక పూజ చాలా ఇష్టమని చెప్తారు. ఎందుకో తెలుసా...



           పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు అగ్ని పుట్టించి లోకాలన్నిటినీ తన దావానలంతో దహించి వేయసాగాడు. అనలాసురుని కారణంగా ఏర్పడిన వేడిని భరించలేని దేవతలందరూ అనలాసురిని బారి నుంచి కాపాడమని వినాయకుణ్ణి వేడుకున్నారంట. అప్పుడు వినాయకుడు ఒక్కసారిగా తన శరీరాన్ని పెంచి అనలాసురుని మింగేసాడంట! అనలాసురుని పీడ విరగడైనందుకు దేవతలంతా సంతోషించారు. కానీ అనలాసురుని మింగిన గణపయ్య శరీరం నుంచి విపరీతమైన అగ్ని పుట్టి గణపతి శరీరం మంటలు పుట్టసాగింది.

ఇక గణపయ్య శరీరంలో మంటలను తగ్గించడానికి దేవతలందరూ ఎన్నో ప్రయత్నాలు చేసారు. అన్నీ విఫలమయ్యాయి. గణపతి శరీరంలో మంటలు తగ్గలేదు. చివరకు కొంతమంది ఋషులు వచ్చి 21 గరిక పోచలు సమర్పిస్తే గణపతి శరీరంలో వేడి తగ్గుతుందని చెప్పడంతో  21 గరికలు  గణేశుని తలపై ఉంచగానే వినాయకుని శరీరంలో మంటలు తగ్గి ఉపశమనం కలుగుతుంది.



అప్పటినుంచి ఏ పని అయినా ఆరంభించేటప్పుడు, శుభకార్యాల సమయంలో గణపతిని గరికతో ఆరాధిస్తే నిర్విఘ్న్గంగా పనులు నేరవేరడమే కాకుండా సర్వ శుభాలు కలుగుతాయని గణపతి వరమిచ్చాడట.

ఈ ఆలయం గురించి వింటే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే / jagannath swamy temple uttarapradesh kanpoor

 

ఈ ఆలయం గురించి వింటే

దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే !!!



           భారతదేశంలో ఎన్నో హిందూ పుణ్యక్షేత్రాల్లో సైన్స్‌కు అందని అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు 50 కి.మీ దూరంలో బెహతా గ్రామంలో ఉన్న జగన్నాథ్ ఆలయం ఒకటి. ఈ ఆలయంలో జరిగే అద్భుతం గురించి వింటే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఈ ఆలయం వర్షాకాలాన్ని ముందుగానే అంచనా వేసి చెబుతుందట. రుతుపవనాలు ఎప్పుడు వస్తాయి? ఏడాదిలో ఎంత వర్షం కురుస్తుంది? తక్కువా.. ఎక్కువా.. ఇవన్నీ చెప్తుందట. అందుకే ఈ జగన్నాథుని ఆలయాన్ని మాన్‌సూన్ టెంపుల్ అని పిలుస్తారట.



            రుతుపవనాల రాకకు కొన్ని రోజుల ముందు.. ఆలయ గర్భగుడి పైకప్పు నుంచి నీటి చుక్కలు పాడడం మొదలుతుంది. ఈ నీటిచుక్కల సైజును బట్టి ఆ ఏడాది ఎక్కువ వర్షాలు పడతాయా? తక్కువ పడతాయా? అనేది అంచనా వేస్తారట. జూన్ నెల ఫస్ట్ హాఫ్‌లో ఆలయ గర్భగుడి నుంచి చుక్కలు పడటం ప్రారంభమవుతుందట. ఈ ఆలయంలో జగన్నాథుని 15 అడుగులు నల్లరాతి విగ్రహంతో పాటు ఆయన సోదరుడు బలరాముడు, సోదరి సుభద్ర విగ్రహాలున్నాయి.

3, జులై 2024, బుధవారం

బయటపడబోతున్న పూరీ జగన్నాథుని రత్నభండార్ మిస్టరీ / ఆ మూడో గదిలో ఏముంది?

        జగన్నాథ దేవాలయం. కృష్ణభక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఆలయం. శ్రీకృష్ణ భగవానుడు సోదరి సుభద్ర సోదరుడు బలభద్రునితో కలసి కొలువుతీరిన ఆలయం. మానవ మేధస్సుకందని ఎన్నో రహస్యాలకు నిలయం ఈ పూరీజగన్నాథ దేవాలయం. అందులో రత్నభండార్ ఒకటి.

             అపార నిధి నిక్షేపాలకు, సంపదకు నిలయం రత్నభండార్

నిధి నిక్షేపాలున్న, తెరవడానికి వీలుకాని రహస్య గదులలో అపార సంపద గురించిన ప్రస్తావన రాగానే మనకు వెంటనే గుర్తొచ్చేది కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయం. ఆ అనంత పద్మనాభస్వామి ఆలయం మాదిరిగానే పూరీ ఆలయంలో కూడా రత్నభండార్ లో కూడా అపార సంపద ఉందని నమ్ముతారు.

                      అనంతపద్మనాభుని ఏడో గది మాదిరిగానే

                       జగన్నాథుని రత్నభండార్ లో భీతర్ బండార్

       


జగన్నాథ ఆలయంలోని రత్నభండార్ లో స్వామికి సంబంధించిన విలువైన ఆభరణాలు, వజ్రవైడూర్యాలు ఎన్నో ఉన్నాయని చెప్తారు. ప్రసిద్ధ పూరీ శ్రీ క్షేత్రం జగన్నాథుడు అలంకార, భోజన ప్రియుడని భక్తులంటారు. ఆయన సన్నిధిలో సోదరీ సోదర సహిత జగన్నాథునికి నిత్యం ఉత్సవాలే. ఏడాదిలో 13 ప్రధాన ఉత్సవాలు. నాలుగుసార్లు ఊరేగింపులు అన్నిటి కంటే పెద్దదైన ప్రపంచ ప్రసిద్ద రథయాత్ర. ఆ వేేడుకల్లో ఆయా సందర్భాలలో నవరత్నాలు పొదిగిన స్వర్ణాభరణాలను స్వామి వారి రత్నభాండారం నుంచి తెచ్చి అలంకరిస్తారు. అది కూడా భాండాగారం మొదటి గదిలో నుంచి. అంటే బాహర్ భండార్ అని పిలువబడే వెలుపలి గడిలోనించి. అయితే లోపల ఇంకో గది ఉంది అదే భీతర్ భండార్ అని పిలిచే లోపలి గది. దశాబ్దాలనుంచి దానిలోనికి ఇప్పటివరకు ఎవరూ ప్రవేశించలేకపోయారు. దీంతో ఈ రత్నభండార్ లోని బీతార్ భాండాగారం అనేక ఏళ్లుగా అంతుచిక్కని రహస్యంగా మారింది.



                 ఇంద్రద్యుమ్న మహరాజుకు శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి ఆదేశించిన ప్రకారం పూరీ ఆలయాన్ని నిర్మించినట్లు పురాణ కధనం. ముల్లోకాల్లోనూ ఇలాంటి క్షేత్రం మరొకటి లేదని పురాణాలు చెప్తున్నాయి.  ఈ ఆలయం నిండా సైన్స్ కు కూడా అంతుచిక్కని రహస్యాలున్నాయని చెబుతారు.ధర్మ సంస్థాపన కోసం ఆదిశంకరాచార్యుల వారు దేశంలోని నలుదిక్కుల్లో నాలుగు మఠాలను పీఠాలు ఏర్పాటు చేసారు. అందులో ఒకటి ఈ పూరీ క్షేత్రంలోనే ఉంది. ఇక్కడ జరిగే రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధి చెందింది. మరికొన్ని రోజులలో రథయాత్ర జరగబోతోంది. ఇలాంటి సమయంలో ఇప్పుడు పూరి జగన్నాథ ఆలయం అందులోని రత్నభండార్ హాట్ టాపిక్ గా మారింది.



విజయవాడ దుర్గమ్మ ఆలయంలో తొలిసారిగా వారాహి ఉత్సవాలు/vijayawada durga temple festivals

 

విజయవాడ దుర్గమ్మ ఆలయంలో

తొలిసారిగా వారాహి ఉత్సవాలు



     విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో మొదటిసారిగా వారాహి ఉత్సవాలను నిర్వహించనున్నారు. జులై 6 నుంచి 15 వరకు 9 రోజుల పాటు ఈ నవరాత్రులు జరుగుతాయని శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం ఈవో రామారావు ఆదివారం నాడు వెల్లడించారు. జులై 6న ఆషాడం మొదలవుతుందని, నెలరోజులపాటు ఆలయంలో ఆషాడమాస సారె మహోత్సవం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అమ్మవారికి భక్తులు సారె సమర్పణకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసినట్లు ఆయన చెప్పారు.

       ఇక, జులై 14న తెలంగాణ మహంకాళీ ఉత్సవ కమిటీ.. అమ్మవారికి బోనాలు సమర్పిస్తుందని పేర్కొన్నారు. జులై 19 నుంచి మూడు రోజులపాటు శాకాంబరీ దేవి ఉత్సవాలు జరుగుతాయని వివరించారు. మహానివేదన సమయంలో ప్రోటోకాల్‌ దర్శనాలు నిలిపివేయనున్నట్లు తెలిపారు. ఈ సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని.. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు వీఐపీ దర్శనాలు ఉండవన్నారు. 

          నవరాత్రుల్లో భాగంగా ప్రతి రోజూ సాయంత్రం వారాహిదేవికి అర్చనలు నిర్వహిస్తారు. చివరి రోజున వారాహి హోమం, పూర్ణాహుతి జరుగుతాయి.



జగన్మాతకు సంబంధించిన రూపాలను సప్తమాతృకలు అంటారు. ఆ ఏడు సప్త మాతృకలో ఒకరు వారాహి అమ్మవారు. పురాణాల ప్రకారం రక్తబీజుడు, శంభు, నిశంభు వంటి కొందరు రాక్షసుల సంహారంలో వారాహి అమ్మవారి ప్రస్తావన వస్తుంది. లలితా దేవి సర్వ సైన్య అధ్యక్షురాలే వారాహి అమ్మవారని పురాణాలు, గ్రంథాలలో పేర్కొన్నారు. అమ్మవారి రూపం వరాహ ముఖం. ఎనిమిది చేతులతో పాశం, నాగలి, శంఖ చక్రాలతో పలు ఆయుధాలు చేతబట్టి.. గుర్రం, సింహం, పాముపై సంచరిస్తుంది.



ఇక, లలితాదేవి స్వరూపమైన వారాహీ అమ్మవారిని పూజిస్తే అహంకారం తగ్గుతుందని అంటారు. వారాహీదేవిని పూజిస్తే కష్టాల నుంచి విముక్తి, శత్రునాశనం. వారాహీ అమ్మవారు సస్య దేవత కావడంతో ఈ తొమ్మిది రోజులు అమ్మవారు చిత్రపటాన్ని పొలం ఉంచి పూజలు చేస్తే పంటలు బాగా పండుతాయని నమ్మకం. అమ్మవారి ధ్యానం దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కల్పిస్తుంది. ఇక, జ్యేష్ఠ మాసం చివరిలో అమ్మవారి దీక్షను చేపడతారు. నవరాత్రుల వేళ ఎలాంటి నియమాలు పాటిస్తారో.. వారాహి నవరాత్రుల్లోనూ అలాగే కఠినంగా దీక్ష చేస్తారు.

15, జూన్ 2024, శనివారం

కేదార్ నాథ్ ఆలయానికి ఎందుకంత ప్రాధాన్యత!? హిమాలయాల్లో శివయ్య లీల

 

కేదార్ నాథ్



          ఎటువంటి టెక్నాలజీ, పరిజ్ఞానం లాంటివి  అందుబాటులో లేని ఆ  కాలంలోనే ఎంతో అద్భుతంగా దేవాలయాలను నిర్మించారు మన పూర్వీకులు. ఇప్పుడు ఉన్నట్టు జేసీబీలు కానీ భారీ వాహనాలు అంటూ ఏవీ  లేని కాలంలో కూడా ఎన్నో  వేల టన్నుల బరువున్న బండ రాళ్ళను సైతం ఒక చోటికి చేర్చి దేవాలయాలను నిర్మించిన  ఆ టెక్నాలజీ మన భారతీయుల సొంతం. అలాంటి అద్భుత ఆలయం హిమాలయాల్లో నెలకొన్న కేదార్ నాథ్ ఆలయం.



ఆరునెలలు మాత్రమె ఇక్కడ పూజలు జరుగుతాయి. మిగిలిన ఆరునెలలు మూసి ఉంటుంది. ఆరు నెలలు మూసేసినా కూడా మళ్ళీ తెరిచినపుడు ఆలయం పరిశుభ్రంగా ఉంటుంది. ఆలయంలో దీపం వెలుగుతూనే ఉంటుంది. కేదార్‌నాథ్ ఆలయాన్ని  బూడిద రంగులో ఉన్న అతిపెద్ద రాళ్లతో నిర్మించారు. ఆ రోజుల్లో ఇంత భారీ ఎత్తున్న ఉన్న  రాళ్లతో ఎలా నిర్మించారన్నది ఇప్పటికీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీనికి సంబంధించి శాస్త్రవేత్తలు ఎన్ని పరిశోధనలు చేసిన లాభం లేకపోయింది.

ఈ ఆలయానికి సంబంధించి పూర్తి చరిత్ర కింద వీడియోలో చూడండి 



నమ్మడం కష్టమే!కాని నమ్మక తప్పదు! 2013 వరదల్లో కేదార్ నాథ్ గుడిని రక్షించినదిదే!

 

భీమ్ శిల - కేదార్ నాథ్ వరదలు 

           2013 లో ప్రకృతి ప్రకోపానికి ఉత్తరాఖండ్  వరదల్లో మునిగిపోయింది. ఎంతో జననష్టం, ఆస్తి నష్టం జరిగింది కానీ  కేదార్‌నాథ్ ఆలయానికి  మాత్రం ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఆ సమయంలో అక్కడ భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఇక ఈ వరదల్లో  వేలాది ఇళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి… ధ్వంసమయ్యాయి, వేలాది మంది మరణించారు. పెద్ద పెద్ద కట్టడాలు కూడా  పేకమేడల్లా  కుప్పకూలిపోయాయి… అలాంటి సమయంలో  కేదార్నాథ్ ఆలయంలో వందల మంది భక్తులు చిక్కుకుపోయారు…



            అలాంటి సమయంలో ఇంకా భయపెట్టడానికి అన్నట్టుగా ఎంతో ఎత్తు మీద నుంచి ఒక పెద్ద ఏకరాతి శిల కొట్టుకుంటూ, దొర్లుకుంటూ వచ్చింది. అంత భారీ శిల గనక ఆలయాన్ని ఢీకొంటే మాత్రం అంతా ఇక ఐపోయినట్టే అనుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. ఐతే ఆ రాయి అలా దొర్లుకుంటూ వచ్చి గుడికి కొంచెం వెనకగా పడి ఇక  అక్కడితో ఆగిపోయింది. ఆ భారీ శిల ఈ వరద ప్రవాహాన్ని రెండు పాయలుగా చీల్చేసరికి  వరద గుడికి రెండు వైపులా నుంచి శరవేగంగా వెళ్ళిపోయింది. దాంతో ఆలయానికి ఎం కాలేదు. భక్తులు కూడా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. గుడి సేఫ్ గా ఉంది. 



             ఆ రాయే భీమశిల. ఇప్పటికి కూడా భక్తుల చేత పూజలందుకుంటోంది. భీమశిల గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే కింద వీడియో చూడండి.`



29, మార్చి 2024, శుక్రవారం

తిరుమల శ్రీవారికి పగిలిన కుండలో పెట్టే నైవేద్యం ఏంటో తెలుసా!? /odu naivedyam in tirumala

          తిరుమల శ్రీవారికి ప్రతి నితం రక రకాల పిండివంటలు, అన్నప్రసాడం, తీపిపదార్ధాలు నైవేద్యంగా సమర్పిస్తారు. పులిహోర, చక్కెరపొంగలి, మలహోరా, మిరియాల ప్రసాదం, నేతి పొంగలి, జిలేబి, మురుకులు ,లడ్డూ, వడ, పాయసం, బొబ్బట్లు అబ్బో ఎన్ని రకాల నైవేద్యాలు సమర్పిస్తారో. అయితే ఎన్ని రకాల నైవేద్యాలు సమర్పిస్తారో. ఇన్ని రకాల నైవేద్యాలు సమర్పించినా ఆ వెంకటేశ్వరునికి మాత్రం వీటన్నిటి కంటే ఒక్క నైవేద్యం మాత్రం అత్యంత ప్రీతిపాత్రమైనడట. అందుకే ఈ నైవేద్యాలన్నీ కులశేఖర పడి దగ్గరనుంచే శ్రీనివాసునికి సమర్పిస్తే ఈ ఒక్క నైవేద్యం మాత్రమె కులశేఖర పడి దాటి శ్రీనివాసుని సన్నిధిలో స్వామికి నివేదన చేస్తారట. మరి ఆ ఒక్క నైవేద్యం ఏంటి. ఆ నైవేద్యానికి ఎందుకంత ప్రాధాన్యత తెలుసుకుందాం..



         తిరుమల వేంకటేశ్వరునికి ''ఓడు'' అని వ్యవహరించే పగిలిన కొత్త మట్టికుండలో వెన్న మీగడలు కలిపిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ అన్నాన్ని ''మాతృ దద్దోజనం'' అంటారు 

                ఓడు అంటే పగిలిన మట్టి కుండా అని అర్థం. ఆ పగిలిన మట్టికుండలో పెరుగన్నాన్ని స్వామికి నివేదిస్తారు. కలియుగ ప్రత్యక్షదైవం, లక్ష్మీవిభుడు, అత్యంత ధనవంతుడైన శ్రీ వేంకటేశ్వరునికి పగిలిన కుండలో నైవేద్యమా... ఆశ్చర్యంగా ఉంది కదూ... అవును పగిలిన మట్టికుండలో పెరుగన్నాన్ని స్వామికి నివేదిస్తారు... ఎందుకలా! సాక్షాతూ లక్ష్మీవల్లబుడైన శ్రీవారికి వెండి బంగారాలకు కొదవా... మణిమాణిక్యాలకు కొదవా... మరి ఆ శ్రీవారికి  పగిలిన కుండలో  పెరుగన్నం సమర్పించాడమేంటి? ఆ నైవేద్యం శ్రీవారికి అంట ప్రీతిపాత్రమైనదెలా అయింది... ఆ కారణమేంటి? చూద్దాం...

          తొండమాన్ చక్రవర్తి శ్రీవారికి ప్రియమైనభక్తుడు… వేంకటేశ్వరుని మామగారైన ఆకాశారాజుకి తమ్ముడు.  శ్రీ వేంకటేశ్వరునికి చిన్న మామగారు. శ్రీవారిని నిత్యం బంగారు పూలతో అర్చించేవాడు. అయితే తొండమానుడికి, తానే శ్రీవారికి గొప్ప భక్తుడినని విపరీతమైన గర్వం ఉండేది. ఇలాంటి సమయంలోనే తాను బంగారు పుష్పాలు పెట్టి స్వామికి పూజ చేసి వెళ్ళిపోయేవాడు. అయితే తాను మళ్ళీ స్వామి పూజకు వచ్చేసరికి స్వామి దగ్గర తాను పూజించిన బంగారు పుష్పాలకు బదులు మట్టి పుష్పాలు కనిపించేవి. ఏంటీ విపరీతం ... తాను బంగారు పుష్పాలతో పూజ చేస్తే ఈ మట్టిపూలు ఎలా వస్తున్నవి అని చింతించాడు.

      అయితే శ్రీవేంకటేశ్వరుడు ఓ రాజా! ఇవి నిస్వార్ధంతో, నిష్కలంకమైన భక్తితో పూజించే కుమ్మరి భీమన్న సమర్పించిన పుష్పాలు అని చెప్పాడు. అతని నిష్కళంకమైన భక్తి కారణంగా మట్టి పుష్పాలైనా అవి నా చెంతకు చేరాయి అని చెప్పాడు.

ఆ కుమ్మరి నాకంటే భక్తుడా! నేను సమర్పించే స్వర్ణ పుష్పాలను కూడా పక్కక్ నెట్టేవిధంగా నాకంటే గొప్ప భక్తుడా!  అని అహంకారంతో అడిగాడు తొండమాన్ చక్రవర్తి.  సరే అతని భక్తిని నువ్వే స్వయంగా చూడు అని కుమ్మరి భీమన్న ఇంటికి తొండమాన్ ని తీసుకొని వచ్చారు శ్రీవారు. వారిని చూసి సాదరంగా ఆహ్వానించాడు భీమన్న. ఆ కుమ్మరి భీమన్న నిత్యం శ్రీవారి కైంకర్యాలు కొరకు కుండలను అందించేవాడు. నిత్యం స్వామి సన్నిధికి వెళ్లి పుష్పాలతో అర్చించే సమయం అవకాశం లేని కుమ్మరి భీమన్న, తన వృత్తి పని చేసుకుంటూనే తాను పని చేసుకుంటున్న చోటే స్వామి వారి ప్రతిమను ఏర్పాటు చేసుకొని తన ఇంటివద్దనే పూజించేవాడు. కుండలు తయారుచేయ్యగా మిగిలిన చేతికంటిన మట్టితో పుష్పాలను చేసి స్వామికి అర్పించేవాడు.  అతని భక్తి కారణంగా ఆ మట్టి పుష్పాలు శ్రీవారి ఆలయంలో స్వామి సన్నిధికి  చేరేవి.

          తన ఇంటికి వచ్చిన శ్రీవారికి తన శక్త్యానుసారం  ఒక కుండపెంకు లో పెరుగన్నం సమర్పించాడట కుమ్మరి భీమన్న. ఆ నివేదన తనకెంతో ఇష్టమైనదిగా భావించారట స్వామివారు. దాంతో కుమ్మరి భీమన్న శ్రీవారికి సమర్పించిన నైవేద్యానికి సూచనగా  ఓ కుండను తీసుకోని మీద భాగం వరకు పగులగొట్టి… క్రింది భాగంలో ఆకూ వేసి ప్రసాదాలు వడ్డించి… కుండ మెడభాగాన్ని క్రింద ఉంచి నివేదన చేసే వారు. కాలక్రమేణా చోటు చేసుకున్న మార్పులలో గంగాళాలు అందుబాటులోకి రావడంతో ఓడు వినియోగం తగ్గింది. కానీ ఇప్పటికే కూడా  శ్రీవారికి గర్భాలయంలో సమర్పించే ప్రసాదాన్ని మాత్రం ఓడు ప్రసాదంగానే పిలుస్తారు. స్వామి వారికి ఇంత ప్రీతిపాత్రమైన నైవేద్యం కాబట్టే మిగిలిన అన్ని ప్రసాదాలు కులశేఖర పదికి ఈవలె పెట్టి స్వామికి నివేదన చేస్తే ఈ ఓడు నైవేద్యం మాత్రం స్వామి సన్నిధికి తీసుకువెళ్ళి శ్రీవారికి సమర్పించడం జరుగుతుంది. ఇదీ వెంకటేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన ఓడు నైవేద్యం వెనకున్న కథనం.

 

 

 

తిరుపతిలో ఈ ప్రదేశం చూడకపోతే చాలా మిస్సవుతారు / If you don't see it in tirupati you will miss it a lot

 

     తిరుపతిలో ఈ ఆలయాన్ని చూడకపోతే మీరు చాలా మిస్సవుతారనే చెప్పాలి. ఈ ఆలయంలో శివుని డమరుక శబ్దం, ఓంకారం వినిపిస్తుందట. అక్కడే ఇరవై అడుగుల ఎత్తునుండి హోరుమంటూ దూకే జలపాతం, గలగలమంటూ ఉరికే గంగమ్మ తల్లి తొలిసారి భగీరథుని కోరిక మీద శివుని ఝటాఝూటం నుంచి ఉరుకుతూ, దుముకుతున్న గంగమ్మను కళ్ళముందు నిలిపే దృశ్యం. పాతాళం నుంచి భూమిని చీల్చుకొని వచ్చిన శివలింగం. శ్రీమన్నారాయణుని అంశతో పుట్టిన కపిల మహర్షి తపస్సు చేసిన స్థలం... శివ, కేశవ అబేధాన్ని చాటే ఆలయం... ఇటు ఆధ్యాత్మిక విశేషాలు, అటు ప్రకృతి అందాలు కలగలిసిన అద్భుత ఆలయ విశేషాలు తెలుసుకుందాం..



      వైష్ణవ క్షేత్రాల ప్రసక్తి రాగానే ముందుగా జ్ఞాపకం వచ్చే ఆలయాలలో ముందువరుసలో ఉంటుంది తిరుపతి క్షేత్రం. అక్కడ ప్రతి ఆకూ, పువ్వూ, కొమ్మ, రెమ్మ ఒక్క మాటలో చెప్పాలంటే అణువణువూ వేంకటేశ్వరుడే. ప్రపంచ ప్రసిద్దిచెందిన తిరుమల. కొండమీద వెంకన్న. కొండ కింద శివయ్య. తిరుపతి అనగానే వెంటనే మన కళ్ళముందు మెదిలేది శ్రీవెంకటేశ్వరస్వామి దివ్యదర్శనం ఒకటయితే రెండవది ఇరవై అడుగుల ఎత్తునుండి హోరుమంటూ దుముకుతూ చూపు తిప్పుకోనివ్వని కపిలతీర్థం జలపాతం. కపిలేశ్వరస్వామి ఆలయం. ఇది శివకేశవ అబెదాన్ని చాటి చెప్పే గొప్ప క్షేత్రం. ఎందుకంటే ప్రముఖ  వైష్ణవ క్షేత్రమైన తిరుపతిలో అంతే పురాణ ప్రసిద్ధితో వెలసిల్లుతోన్న శైవక్షేత్రం కపిలతీర్థం కపిలేశ్వరస్వామి ఆలయం. ఆ కపిల తీర్థం విశేషాలిప్పుడు తెలుసుకుందాం.

యుగయుగాల చరిత్రను సొంతం చేసుకున్న క్షేత్రం కపిలతీర్థం

     కృతయుగంలో కపిల మహర్షి ఇక్కడ ఈశ్వరుని కోసం ఘోర తపస్సు చేశాడట. ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు పాతాళంనుంచి భూమిని చీల్చుకుని ఇక్కడ వెలిశాడని స్థలపురాణం. అలా వెలసిన శివయ్యను సేవించడానికి బ్రహ్మదేవుడు గోరూపంలోను, విష్ణుమూర్తి గోపాలుదిగాను వచ్చి కపిలేశ్వరుని అభిషేకించినట్టు చెప్తారు. శివలింగంతో పాటు భూమి మీదకు వచ్చిన భోగవతీ జలాలు కపిలతీర్తంగా ప్రసిద్ధి చెందాయని చెప్తారు.  కపిలముని తపస్సు కారణంగా ఇక్కడ  ఈశ్వరుడుకొలువుతీరాడు  కాబట్టి ఈ స్వామికి కపిలేశ్వరుడు అని కపిల లింగం అని ప్రసిద్ధి చెందాడు. ఆ తరవాత త్రేతాయుగంలో అగ్నిదేవుడు ఈ స్వామిని ఆరాధించాడు.  అందువల్ల, ఈ లింగాన్ని ఆగ్నేయ లింగమనికూడా పిలుస్తారు. పాతాళం నుంచి భూమిని చీల్చుకుంటూ వచ్చిన  కపిలేశ్వరుడు ఇక్కడ కామాక్షీదేవి సమేతంగా కొలువయ్యాడు. ఈ ఆలయానికి ఉన్నత శిఖరమా అనిపించేలా ఉంటాయి తిరుమల కొండలు. ఆ కొండలమీది నుంచి గలగలా పారుతూ, 20 అడుగుల ఎత్తునుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకుతుంది ఆకాశగంగ. ఈ పుష్కరిణినే కపిలతీర్థం అంటారు. ఈ తీర్థాన్ని శైవులు కపిల తీర్థమనీ, వైష్ణవులు ఆళ్వార్‌ తీర్థమనీ పిలుచుకున్నా అత్యంత ప్రసిద్ధి చెందినది మాత్రం కపిలతీర్తమనే. పూర్వం వైష్ణవులు ఈ జలపాతం క్రింద ఉన్న కోనేటి చుట్టూ నాలుగు మూలల్లోనూ నాలుగు సుదర్శన రాతిశిలలను స్థాపింఛి, రాతిమెట్లు, సంధ్యావందన దీపాలనూ ఏర్పాటుచేశారు. అందుకే, అప్పట్నుంచీ దీన్ని చక్రతీర్థమని పిలిచేవారు.



      విజయనగర చక్రవర్తిఅచ్యుత రాయలు ఈ తీర్ధము చుట్టూ రాతి మెట్లు, మంటపము నిర్మించాడు. 1830ల నాటికి ఈ ప్రాంతం చుట్టూ విశాలమైన మంటపం ఉండేదని,

11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి రాజేంద్రచోళుని కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. అప్పట్లో రాయన్‌ రాజేంద్రచోళ అనే చోళ అధికారి దీని నిర్మాణ సూత్రధారి. చోళులు శివభక్తులు కావడంతో దీన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్మించారు. ఆహ్లాదకరమైన కపిల తీర్థాన్ని చోళులు అభివృద్ధి చేస్తే... అచ్యుతదేవరాయల హయాంలో వైష్ణవులు దీన్ని ఆళ్వారుతీర్థంగా మార్చారు. 12వ శతాబ్దం నుంచీ 18వ శతాబ్దం వరకూ దీన్ని ఆళ్వారు తీర్థంగానే వ్యవహరించారు. పదహారో శతాబ్దంలో విజయనగరం నుంచి వచ్చిన సెవ్వుసాని అనే దేవదాసి ఈ ఆలయానికి ఎంతో సేవ చేసిందట. ఆలయంలోని వినాయకుణ్ణి ఆవిడే ప్రతిష్ఠించిందని చెప్తారు. కపిలతీర్థంలో కపిలేశ్వర స్వామితోపాటు, మహా గణపతి, వల్లీ దేవసేన సామెత సుబ్రమణ్యస్వామి, శ్రీ రుక్మిణీ సత్యభామా సామెత వేణుగోపాలస్వామి, లక్ష్మీనారాయణ స్వామి, నమ్మాళ్వార్, నాగ దేవతలు, నవగ్రహాలు, కాశీవిశ్వేశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు, కూడా కొలువు తీరి ఉన్నారు. ఆహ్లాదం కలిగించే ఆలయం కపిలేశ్వర ఆలయం. అతి ప్రశాంతమైన వాతావరణం. పాతాళం నుంచి పైకి ఉబికి వచ్చిన పరమేశ్వరుడు. భువి నుంచి దివికి దిగి వస్తున్నా గంగమ్మ లా ఇరవై అడుగుల పైనుంచి కిందికి ఉరుకుతున్న కపిలతీర్థం జలపాతం. ఇలాంటి ప్రశాంత వాతావరణంలో భక్తుల ఆర్తిని తీర్చే కపిలేశ్వర స్వామి ఆలయం. ఆలయ దర్శనం ఆధ్యాత్మికను పెంచితే, జలపాతంలో స్నానం శారీరక ఇబ్బందులను తొలగిస్తుంది. ఈ ఆలయానికి ముందు ఒక పాడుబడ్డ గుడి ఉంటుంది. అది నమ్మాళ్వార్‌ అనే ఆళ్వారు గుడి అని చెబుతారు.



     పూర్వం తిరుమల చేరుకోవటానికి రవాణా  సౌకర్యం అంతగా లేనప్పుడు, మెట్లమార్గం ద్వారా నడచి తిరుపతి వెళ్తూ, ఈ కపిలతీర్థంలో స్నానం   చేసి కపిలేశ్వరుడిని దర్శించి కాలినడకన తిరుమల వెళ్ళేవారట. రవాణా సౌకర్యాలు అపరిమితంగా పెరిగిన ఇప్పుడు కూడా తిరుమల నుంచి అలిపిరి వెళ్ళే అన్ని బస్ లు ఇక్కడున్న నంది సర్కిల్ వైపు నుంచే వెళ్తాయి. అక్కడ దిగి కపిలతీర్థం వెళ్ళవచ్చు.  

ముఖ్యంగా, వర్షాకాలంలో ఇక్కడకు వస్తే... ఈ జలపాతం సౌందర్యం కనులకు విందే. అంతెత్తునుంచి హోరుమంటూ ఉబికే జలపాతం సుందర దృశ్యాలు చూపుతిప్పుకోనివ్వవు. ఈ  ప్రశాంత వాతావరణం అడుగు కూడా కడపనివ్వదు. ఇదిగో ఇక్కడ చూడండి హోరుమంటూ జాలువారుతున్న ఆ జలపాత అందాలనుంచి చూపి తిప్పుకోగాలమా... ఎంతసేపైనా చూస్తూనే ఉండాలనిపిస్తుంది కదా.

తిరుపతి బ్రహ్మోత్సవాల సందర్భంలోను, శివరాత్రి సందర్భంగాను శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం కూడా వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతుంది. ఇక్కడ వినాయక ఉత్సవాలు, కార్తీకమాస ఉత్సవాలు దేవి నవరాత్రలు, కామాక్షిదేవి చందన అలంకారం అత్యంత విశేషంగా వైభవంగా జరుగుతాయి.

  


         ఈ కపిలతీర్థం మహిమను గురించి సాక్షాత్తూ శ్రీనివాసుడే వకులమాతతో చెప్పినట్టు పురాణ కథనాలు చెప్తున్నాయి.  పద్మావతి శ్రీనివాసుల వివాహం గురించి ఆకాశరాజుతో మాట్లాడడానికి వెళ్తున్న తల్లి వకులమాతతో,  అమ్మా నీవు ముందు కపిలతీర్థం  లో స్నానం ఆచరించి కపిలేశ్వరున్ని దర్శించి ఆ తర్వాతే  నారాయణవనం వెళ్ళి మా వివాహం విషయం మాట్లదు అలా చేస్తే శుభం జరుగుతుంది అని చెప్పాడట శ్రీనివాసుడు. దీన్ని బట్టే ఈ కపిలతీర్థం ఎంత పవిత్రమైనడి అన్న విషయం అర్థమవుతుంది.

కార్తీక మాసంలో ఈ కపిలేశ్వర ఆలయాన్ని అత్యంత శుభప్రదమని పురాణాలు చెబుతున్నాయి. కపిలతీర్థం కపిలేశ్వరసామి ఆలయంలో కార్తీక పున్నమ రోజున విశేషపూజలు జరుగుతాయి. ఆరోజున ఈ కపిలతీర్థంలో స్నానం చేసి శివదర్శనం చేసినవారికి జీవితంలో శాంతి, లభిస్తుందని మరణానంతరం  ముక్తి లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి.

 

కార్తీక పౌర్ణమి మధ్యాహ్నవేళ ముల్లోకాల్లోని సకలతీర్థాలూ నాలుగు గంటలపాటు కపిలతీర్థంలో నిలుస్తాయన్నది పురాణ వచనం. ఆ సమయంలో ఈ తీర్థంలో స్నానమాచరిస్తే సకల పాపాలూ ప్రక్షాళన అవుతాయని భక్తులు నమ్ముతారు. ఈ తీర్థంలో స్నానం చేసి ఎ చిన్న దానం చేసినా అనంతమైన పుణ్య ఫలితాలు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. అందుకే కార్తీకమాసం ప్రారంభం కాగానే ఈ తీర్థానికి తండోపతండాలుగా తరలి భక్తులు వస్తుంటారు. కార్తికంలో నిత్యం ఈ తీర్థంలో పుణ్యస్నానాలు చేసేవారితోను  పరమేశ్వరుడికి ప్రీతికరంగా దీపారాధనలు చేసేవారితోను కళకళలాడుతూ కైలాసశోభతో వెలిగిపోతుంది.

      తీర్థయాత్రలతో పాటు ఒక మంచి పర్యాటక ప్రాంతానికి వెళ్లాలనుకునేవారికి ఇది అనువైన ప్రదేశం. ముఖ్యంగా వర్షాకాలంలో కుటుంబంతో సహా వెళితే.. పుణ్యం.. పురుషార్థం అన్నట్టుగా ఇటు ఆధ్యాత్మికంగాను, అటు పర్యాతకంగాను కూడా చక్కగా ఎంజాయ్ మెంట్ దొరుకుతుంది.

      తిరుపతి బస్టాండు నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో అలిపిరి మార్గంలో కపిలతీర్థం ఆలయం ఉంది. తిరుపతి బస్ స్టాండ్ నుండి కపిలతీర్థానికి టిటిడి బస్సులు తిరుగుతుంటాయి. ఇందులో ఉచితంగా ప్రయాణించవచ్చు. అదేవిధంగా ప్రైవేటు వాహనాలు,ఆటోలూ ఉంటాయి. మదనపల్లి, చిత్తూరుల నుంచి తిరుపతి వచ్చే బస్సులు ఈ ఆలయం మీదుగానే వెళ్తాయి. ఇక్కడ దిగి కపిలతీర్థాన్ని చేరుకోవచ్చు.

23, మార్చి 2024, శనివారం

జమదగ్ని నుంచి అలెగ్జాండర్ వరకు / malana village mystery himachal pradesh /most mysterious village in india

 

అదో మర్మగ్రామం! అద్భుతమైన అందాల లోకం! భూలోక స్వర్గంలాంటి పర్యాటక ప్రదేశం! ఓ పాత సినిమాలో చెప్పినట్టు వారాల పేర్లే అక్కడ మనుషుల పేర్లు!

మహర్షి జమదగ్ని నుంచి గ్రీకువీరుడు అలెగ్జాండర్ వరకు సంబంధమున్న గ్రామం.

అది భారతదేశంలో ఓ భాగమే. కాని ఆ గ్రామ వాసులు భారతీయ నియమ నిబంధనల కంటే తమ ప్రత్యేకమైన నియమ నిబంధనలు, ఆచార వ్యవహారాల ప్రకారమే జీవిస్తారు.

ప్రభుత్వ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవీ వాళ్లకు పట్టవు అలాగని వాళ్ళు తిరుగుబాటుదారులు కాదు. కాని తమకే తమకు మాత్రమె ప్రత్యేకమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రం తు.చ. తప్పకుండా పాటిస్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక స్కూల్ తప్ప ప్రభుత్వానికి సంబంధించి ఇంకేవీ ఉండవక్కడ. అప్పుడెప్పుడో కోర్ట్ కూడా ఏర్పాటు చేసిందట ప్రభుత్వం. కాని అందులే కేసులే ఉండవు. 1987 లో అక్కడే కర్దార్ అంటే వారి పెద్ద ఓ కేసును కోర్టుకు తీసుకు వెళ్ళాడు, కోర్ట్ తీర్పు కూడా ఇచ్చింది. కాకపొతే ఆ తీర్పును గ్రామస్తులు పాటించలేదు సరికదా ఆ కోర్ట్ కు వెళ్ళిన పెద్దనే ఊళ్లోనుంచి వేలేసారట అక్కడి వారు.



అక్కడి ప్రజలు స్వేచ్చ, స్వతంత్రాలకు మారుపేరుగా ఉంటారు. అయితే అది విచ్చలవిడితనం మాత్రం కాదు. ఆ గ్రామస్తులు చాల నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలీ అంటే ఈ ప్రపంచానికి దూరంగా భవబంధాలకు అతీతంగా ఎవ్వరితోను సంబధంలేని ఓ రహస్య దీవిలో ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్న ఓ మునీశ్వరుడిలా ఎత్తైన కొండలమధ్య, అందాల లోయలో ఉంటుంది మర్మగ్రామం “మలానా”.

ఇంతకీ ఈ మలానా గ్రామ మర్మమేంటి. ఇదెక్కడుంది...? ఆ కథా కమామిషేంటి?

దేవభూమిలో మర్మగ్రామం మలానా

దేవభూమి హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు జిల్లాలో  అందానికే మరోపేరయిన పార్వతీ లోయను ఆనుకొని ఉంది మలానా గ్రామం. సముద్ర మట్టానికి 9,500 అడుగుల ఎత్తులో ఉన్న పార్వతి లోయలో  పచ్చని, మంచుతో కప్పబడిన పర్వతాల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామం మలానా.



మలానా అంతా ప్రత్యేకమే... వీరు మాట్లాడే భాష దగ్గర్నుంచి వేషం వరకు, జీవన విధానం  దగ్గర్నుంచి పెట్టుకునే పేర్ల వరకు అంతా డిఫరెంట్. ప్రపంచంలో ఎవ్వరికీ తెలియని భాష వీరు మాత్రమే మాట్లాడే వీరి భాష కనషీ భాష. తమ భాషను చాలా పవిత్రంగా చాలా పవిత్రమైందిగా భావిస్తారు మలానా గ్రామ ప్రజలు. అందుకే ఈ భాషను ఎవ్వరికీ బోధించరు వీరు. అందుకే కాస్త సంస్కృతం, కాస్త ఇతర భారతీయ భాషలు, ఇంకాస్త టిబెటన్, మరికాస్త కిన్నెరీ, గ్రీకు భాషల కలగలుపుగా ఉండే ఈ భాష మీద చాలా అధ్యయనాలు కూడా జరుగుతున్నాయట. వీరుండేది మన దేశంలోనే కాని మన ప్రభుత్వ విధి విధానాలేవీ వీళ్ళకు పట్టవు. వీళ్ళకంటూ స్వంతంగా ప్రత్యేకమయిన నియమ నిబంధనలు, చివరకు న్యాయ వ్యవష్టను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఓ విధంగా చెప్పాలంటే ఊరందరిదీ ఒక దారయితే ఉలిపికట్టెది ఓ దారి అంటుంటారు చూడండి అలా ఉంటుందన్నమాట ఈ గ్రామం. అలా అని ఇదేదో ఓ సాధారణ వింత గ్రామం అనుకోకండి. దీని వెనక పెద్ద చరిత్రే ఉంది.



జమదగ్ని రుషి నుంచి అలెగ్జాండర్ వరకు

జమదగ్ని రుషి దగ్గర్నుంచి విశ్వవిజేత కాబోయి కొద్దిలో ఆగిపోయినా అలేగ్జాండర్ వరకు ఈ గ్రామనతో సంబంధం ఉన్నవారే. ముందుగా జమదగ్ని రుషి ఈ గ్రామంతో సంబంధమేంటి అన్నది తెలుసుకొని తరువాత అలెగ్జాండర్ విషయానికి వద్దాం.

     ఓసారి జమదగ్ని మహర్షి పరమేశ్వరుడి గురించి కఠినమయిన తపస్సు చేసాడు. ఆ తపస్సు కు మెచ్చిన భోలాశంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి అనడిగాడు. ప్రకృతి ఒడిలో కూర్చున్నంత ప్రశాంతంగా ఉన్న ప్రదేశాన్ని ఇవ్వు తపస్సు చేసుకుంటాను అనడిగాడు జమదగ్ని. అప్పుడు హిమాలయల్లో ఈ మలానా గ్రామాన్ని సృష్టించి ఇచ్చాడట శివుడు.

      సరే ఆ విషయాన్ని అలా ఉంచితే ఎక్కడో గ్రీకు దేశపు అలెగ్జాండర్ కి ఈ గ్రామంతో సంబంధమేంటి?

     మలానా వాసులు అలెగ్జాండర్ వారసులా!?

               విశ్వవిజేత కావాలన్న కోరికతో ప్రపంచ దేశాలన్నే జయించుకుంటూ భారతదేశంలోకి అడుగుపెట్టిన సందర్భంలో చాలా ప్రాంతాలను తన అధీనంలోకి తీసుకున్న తరువాత ఒక సమయంలో ఒక సమయంలో అలెగ్జాండర్ వెనుతిరగక తప్పని పరిస్తితి ఏర్పడింది అలెగ్జాండర్ కి. ఆ పరిస్తితిలో కొంతమంది సైనికులు ఈ ప్రాంతంలోనే ఉండిపోయారని అదే మలానా గ్రామమని చెప్తారు. వారి సంతతి వారే ఈ మలానా గ్రామంలో తరతరాలుగా జీవిస్తున్నట్టు చెప్తారు. అయితే అలెగ్జాండర్ సైనికుల వారసులు మలానాలో కాదు, పాకిస్తాన్‌లోని కలాష్ లోయ సమీపంలో  ఉన్నారు అని మరో వాదన కూడా వినబడుతుంది.

       ఇక ఈ మలానా గ్రామానికి చాలా విశిష్టతలే ఉన్నాయి. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన పార్వతీ లోయకు ఎంతోమంది పర్యాటకులు వస్తూ ఉంటారు. కాని ఆ సమీపంలోనే ఉన్న ఈ గ్రామంలోకి వెళ్ళడానికి మాత్రం వీల్లేదు. బయటివారిని ఎవ్వరినీ వీరు తమ గ్రామంలోనికి రానివ్వరు. ఒకవేళ ఎవరైనా పొరపాటున ఈ గ్రామంలోకి అడుగుపెడితే వారు శిక్షలు, ఫైన్ లు కూడా అనుభవించాల్సి ఉంటుంది.

      మలానా లోయలో మహిమాన్విత మైన ఔషధాలున్నాయని చెప్తారు. ఓసారి అనారోగ్యానికి గురైన అక్బర్ చక్రవర్తికి ఎవరో మలానాలో ఉన్న ఔషధ వనాల గురించి చెప్పారట. దాంతో ఆయన ఇక్కడికి వచ్చి ఈ ఔషధాలు వాడి స్వస్థత పొందాడని ఓ కథనం ప్రచారంలో ఉంది. అయితే ఇలాంది కథనాలు విని ఎవ్వరైనా అక్కడికి వెళ్లి ఆ మొక్కల మీద చెయ్యి వేస్తే మాత్రం అస్సలూరుకోరట మలానా గ్రామ ప్రజలు.  



         గ్రామంలో సొంత న్యాయ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకున్నారు వీరు. కౌన్సిల్‌లో ఉండే పదకొండుమంది సభ్యులతో ఒక కౌన్సిల్  ఏర్పాటు చేసుకొని ఆ కౌన్సిల్ ద్వారా పాలనా వ్యవహారాలు నిరహించుకుంటారు. ఆ కౌన్సిల్  సభ్యులను తమ గ్రామ దేవత ‘జంబ్లూ’కి  ప్రతినిధులుగా భావి స్తారంతా. అలాగే గ్రామంలో న్యాయ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకున్నారు. దిగువ న్యాయస్థానం, ఎగువ న్యాయస్థానం ఉంటాయి. దిగువ కోర్టులో న్యాయం జరగలేదంటే ఎగువ కోర్టుకు వెళ్లొచ్చు. భారతదేశంలోనే ఉన్నా తమకంటూ ప్రత్యేకమైన ప్రక్రియతో ఉంటారు మలానా వాసులు. తమ గ్రామానికి చెందని వారిని వివాహం చేసుకోరు. తమ గ్రామానికి చెందని వ్యక్తులు చేసే వంటకాలను వీరు స్వీకరించరు.  అబ్బో ఇంకా చాల చాలా ఉంటాయి. ఇక అక్కడున్న వారి పేర్లయితే మరీ ప్రత్యేకం. పుట్టిన రోజును బట్టి పేర్లు పెడతారు. ఆదివారం పుట్టినవారికి అహ్త అని, సోమవారం పుట్టిన వారికి సౌనరు అని, మంగళవారం పుట్టిన వారికి మంగల్ అని... ఇలాంటి పేర్లే పెడతారు. దాంతో ఒకే పేరు గలవాళ్లు చాలామంది కనిపిస్తూ ఉంటారు. జీవన విధానం దగ్గర్నుంచి న్యాయవ్యవస్థ వరకు ప్రతి విషయంలో ప్రత్యేకంగా ఉండడంతో మలానాని కొందరు ‘ద రిపబ్లిక్ ఆఫ్ మలానా’ అని కూడా పిలుస్తుంటారు. ఇది మర్మగ్రామం మలానా కథ.

సరస్వతీ నది నిజంగా ఉండేదా? లేక అన్నీ పుక్కిటి పురాణాలా?

           సరస్వతీ నది నిజంగా ఉందా? ఎప్పుడో ఉండేది తరువాత అంతర్హితమయిపోయింది అని చెబుతారు.  సరస్వతీ నది అసలు ఉండేదా? లేక అన్నీ పుక్కిటి పురా...